అయితే 2009 నుంచి 2014 వరకు ఇది జరిగింది. కానీ ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకోవడం జగన్ జైలుకు కూడా వెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇలాంటి ఒక పరిణామం తమిళనాడు లో చోటు చేసుకుంది. స్టాలిన్ మంత్రివర్గంలోని త్యాగరాాజన్ అనే మంత్రి ఫోన్ లీక్ అయింది. అందులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఏయే సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
ఎందుకు పెడుతున్నారు. ఎవరికీ లాభం చేకూరుతుంది. ఎక్కడ అవినీతి జరుగుతుందనే విషయాలు ఆయన ఫోన్ లో మాట్లాడారు. దీనికి ఆయనకు సంబంధించి మంత్రి పదవిని మాత్రమే చేంజ్ చేశారు. కానీ పూర్తిగా తొలగించలేదు. అయితే దీనిపై ఒక వ్యక్తి సుప్రీం కోర్టులో కేసు వేశారు. స్వయంగా రాష్ట్ర మంత్రి వర్గంలోనే ఒక మంత్రి అవినీతి జరుగుతుందని మాట్లాడారు. ఎక్కడెక్కడ జరుగుతుందని చర్చించారు. దీనిపై కేసును స్వీకరించాలని కోరారు.
దీనికి సుప్రీం కోర్టు స్పందిస్తూ కేసు విచారణ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. మొత్తం ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా కేసులను ఎలా స్వీకరిస్తామని అంది. గతంలో జగన్ విషయంలో ఇదే సుప్రీం కోర్టు లో ఎమ్మెల్యే ఆశ్రయించినపుడు ఆయనపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇప్పుడేమో కుదరదని కోర్టు చెబుతోంది. ఇలా రెండు దోరణుల వల్ల ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం జరిగే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి