
అంతేకాకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. కాపులకు రిజర్వేషన్ల పట్ల జగన్ మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కూడా పలు సమావేశాల్లో కాపులకు రిజర్వేషన్లు తమ పరిధిలో లేవని, దానిపై తాను హామీ ఇవ్వలేనని ఖరాకండిగా చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో విద్యాపరంగా మాత్రమే వర్తింపజేస్తూ చట్టం చేశారు. దాంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో బిజీగా ఉంది వైసీపీ ప్రభుత్వం.
ఒక పక్క టీడీపీ, ఏపీలోని మెజార్టీ వర్గాల పైన వైసీపీ ఆశలు పెట్టుకోవటం.. కాపు సామాజిక వర్గం ఈ సారి ప్రధానంగా జనసేన వైపు చూస్తోందనే ప్రచారం నడుమ టీడీపీ తమ ఓట్ బ్యాంకు పదిలం చేసుకొనే ప్రయత్నాలు చేస్తోంది. మరొక పక్క పవన్ కొత్త స్ట్రాటజీ తో..పొత్తు సంగతి ఎలా ఉన్నా.. ముందుగా తన పార్టీ బలం పెంచుకొనే పనిలో నిమగ్నమయ్యారు. టీడీపీకి చెప్పుకోదగిన ఓట్ బ్యాంక్ ఉన్నా.. 2019 లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ముందు ఓటమి తప్పలేదు. దీంతో, ఈ రెండు పార్టీలు కలవాలని క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల నేతలు కోరుకుంటున్నారు. జనసేన- టీడీపీ పొత్తు ను ఎదుర్కోవడానికి జగన్ వచ్చే ఎన్నికల్లో మరి ఏ ఎత్తు.. వేయబోతున్నారో