ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోతే మాత్రం పుతిన్ ను అమెరికా, యూరప్ దేశాలు ఉరితీయడం ఖాయం. ఇలాంటి ఘటనలే గతంలోనూ జరిగాయి. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుసేన్ వద్ద అణు బాంబులు, హైడ్రోజన్ బాంబుల కంటే ఎక్కువ స్థాయి అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి ఇరాక్ పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని పట్టుకుని ఉరి కంబం ఎక్కించింది. మేం చెప్పింది వినాలన్న అమెరికా, యూరప్ దేశాల మాటలకు  చిర్రెత్తుకొచ్చిన ఇరాక్ అధ్యక్షుడు డాలర్ తో మాకు పని లేదు. ఎవరైనా సరే ఇరాక్ డబ్బులతో వ్యాపారం చేయాలి. చమురు, ఆయిల్ కొనుగోలుకు బంగారం లేదా ఇరాక్ డబ్బులతో వ్యాపారం కొనసాగించాలని సద్ధాం హుసేన్ నిర్ణయించారు.


దీనికి వ్యతిరేకంగా ఇరాక్ పై వంక పెట్టి, ఇరాన్ తో జతకట్టి అమెరికా, యూరప్ దేశాలు ఆ దేశంపై దాడిని కొనసాగించాయి.అనంతరం  అమెరికా, యూరప్ దేశాలు అక్కడి చమురు నిల్వల్ని కొల్లగొట్టాయి. పూర్తిగా తన పరం చేసేసుకున్నాయి. తర్వాత సద్దాంను ఉరితీశాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం ఆయిల్, చమురును రష్యా ఉత్పత్తి చేస్తోంది. దీంతో కళ్లు మండిన అమెరికా, యూరప్ దేశాలు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే అందులో రష్యా ఓడిపోతే పుతిన్ ను ఉరి తీయడం, తర్వాత పూర్తిగా చమురు నిల్వల్ని దోచేసుకోవడం కోసం పన్నిన పన్నాగమని తెలుస్తోంది.


వ్యాగనార్ గ్రూపు, చెచన్ గ్రూప్ రష్యాకు సహకరిస్తోంది. రేపు పొద్దున రష్యా గనక ఓడిపోతే వ్యాగనర్ గ్రూపు చేసిన అరాచకాలకు కారణం పుతినే అని ప్రపంచ దేశాల ఎదుట వాదన వినిపిస్తుంది. పుతిన్ ను ఉరితీసేస్తుంది. జైళ్ల నుంచి బయటకొచ్చిన వారికి, జైలు లో ఉన్న వారికి శిక్షణ నిస్తున్నారు.వ్యాగనర్ గ్రూపు కోసం పోరాడకపోతే మన ప్రాణాలు పోవాల్సిందేనని శిక్షణ తీసుకుని యుద్ధంలో పాల్గొనని ఓ వ్యక్తి  నార్వేలో  సీఎన్ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: