నెల్లూరు కోర్టులో దస్త్రాలు అపహరణ కేసును ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు అప్పగించడంతో వైసీపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇలా సీబీఐకి కేసు అప్పగించడాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  స్వాగతించారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలపై తమకు నమ్మకం లేదని కోర్టు కూడా చెప్పినట్లైందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సీబీఐ తమ విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.


అసలు మాయమైన ఫైలు కేసు ఫిర్యాదుదారుడిని తానే కాబట్టి తన అభిప్రాయమూ సీబీఐ తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. కాకానికి ఏ మాత్రం సిగ్గు, మానవత్వం ఉన్నా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ఘోరమైన నేరాలు చేసే కాకానిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులా నానచకుండా, న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠగా ఈ కేసును సీబీఐ తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.


నెల్లూరు జిల్లా ఎస్పీ సహా స్థానిక అధికారుల్ని తప్పించి, న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. తప్పుడు డాక్యుమెంట్లతో తనపై కాకాని చేసిన అసత్య ఆరోపణలపై తానే కాకాని మీద కేసు పెట్టానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కాకాణి చూపించింది తప్పుడు పత్రాలని విచారణ లో తేలి ముగ్గురు అరెస్టయ్యారన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కేసు కీలకదశలో ఉండగా కాకాని మంత్రి అవ్వటం, మరుసటి రోజే కేసు దస్త్రాలు పోవటం జరిగిందని గుర్తు చేశారు.


కోర్టులో ఉన్న 4వేల దస్త్రాల్లో ఒక్క కాకాణి దస్త్రమే కుక్క అరుపులు వల్ల పోయిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే మంత్రి కాకాణి మాత్రం ఈ సీబీఐ దర్యాప్తును స్వాగతించారు. దీని వల్ల నిజాలు తేలతాయని.. తమకు సీబీఐ దర్యాప్తుపై ఏమాత్రం అభ్యంతరం లేదని కోర్టులోనే చెప్పామని మంత్రి కాకాణి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: