కర్ణాటకలో ఇప్పుడు ఒకటే టాపిక్. సరిగ్గా మరో వారంలో పోలింగ్ జరుగుతుంది అన్న తరుణంలో అక్కడ కొన్ని వీడియోలు తెరపైకి వచ్చాయి. ఈ వీడియోలే ఇప్పుడు కన్నడ పాలిటిక్స్ తో పాటు దేశ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. వైరల్ అవుతున్న సెక్స్ వీడియోలో ఉన్నది హసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవగౌడ మనువడు ప్రజల్ రేవణ్ణ.


ఇతను కొంతమంది యువతులను ట్రాప్ చేసి.. మరికొందరిని బెదిరించి.. తన లైంగిక వాంఛనలు తీర్చుకున్నారు. వాటిని వీడియోలు తీసి అనేక సార్లు బెదిరించాడు. దాదాపు ఇలా 3వేలకు పైగా వీడియోలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.. హసన్ నుంచి మరోసారి ప్రజ్వల్ బరిలో దిగారు. అక్కడ పోలింగ్ కూడా ముగిసింది. అయితే ఎన్నికలు ముగియగానే ఆయన విదేశాలకు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


పర్స్తుతం కర్ణాటకలో జేడీఎస్ తో బీజేపీ పొత్తులో ఉంది. దీంతో ఈ అంశం రాజకీయంగా అగ్గి రాజేస్తుంది. మే 7న మూడో దశ ఎన్నికల్లో కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో బీజేపీ, జేడీఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే కర్ణాటకపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. కానీ ప్రజ్వల్ రూపంలో వాటికి గండి పడే అవకాశం ఉంది.


ఇదిలా ఉండగా ఇప్పటి వరకు నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం. ఈ ఘటనను సమర్థించలేక.. విమర్శించలేక ఆడ కత్తెరలో పోక చెక్కలా తయారైంది బీజేపీ పరిస్థితి. గతంలో దిల్లీలో బ్రిజేష్ కుమార్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు అని రెజ్లర్లు, మణిపుర్ లో దారుణాలు, యూపీలో రేప్లు జరిగినా మాట్లాడని మోదీ.. ఇప్పుడు కూడా మౌనమే దాల్చారు. పది రోజుల క్రితం మోదీ ప్రశంసించిన నేత ఇప్పుడు విదేశాలకు పారిపోయాడని దీనిపై మోదీ ఏం సమాధానం చెబుతారు అని విపక్షాల ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఏదైనా మాట్లాడితే ఒక్క లిగ ఓట్లకు గండి పడే అవకాశం ఉందని.. అందుకే మోదీ సైలెంట్ గా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: