బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల రావు మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు ఇప్పటికే నోటీసులు అందాయి. నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు రావాలని సూచించారు. అనారోగ్యం కారణంగా వారు హాజరు కాలేదు. మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టులు తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
సిట్ దర్యాప్తు మాజీ సిబ్బంది డేటా ధ్వంసం గురించి కూడా లోతుగా పరిశీలిస్తోంది. మాజీ సిబ్ చీఫ్ టి ప్రభాకర్ రావు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చి పోలీసులకు లొంగినట్టు తెలుస్తోంది. ఈ కేసు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో జరిగిన అక్రమాలను బయటపెడుతోంది. సీనియర్ పొలిటికల్ లీడర్లు అధికారుల ఫోన్లు ట్యాప్ చేయడం ఆధారాలు ధ్వంసం చేయడం ఈ కేసు ముఖ్య అంశాలు. సిట్ ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను విచారిస్తోంది.
నవీన్ రావు ఇటీవల సిట్ ముందు హాజరై వివరాలు అందజేశారు. ఈ దర్యాప్తు కేసీఆర్ కేటీఆర్, వరకు చేరుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఈ కేసును రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును వేగవంతం చేసి న్యాయం చేస్తుందని ప్రకటించింది. రాష్ట్రంలో ఈ కేసు పరిణామాలు రాజకీయాలను మరింత ఉత్కంఠగా మార్చాయి. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు సేకరణలో సిట్ దూకుడు పెంచింది.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి