ఉద్యోగం లో ఎక్స్పీరియన్స్ ను ఆధారంగా చేసుకుని వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు.2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీచింగ్ హాస్పిటల్స్ లో పని చేసే వైద్యులకు వేతన సవరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నాటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ వేతన సవరణ జరగలేదు. దీంతో ఆయా వైద్య సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. వైఎస్ జగన్ సీఎం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వైద్యులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ 2021 మార్చి 1 నుంచి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 2 పంటి వైద్య కళాశాలలు, 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న సంగతి తెలిసిందే.. వీటిలో ట్యూటర్ నుంచి ప్రొఫెసర్ వరకు వివిధ స్థాయిల్లో దాదాపు 4 వేల మంది పని చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న వేతన సవరణ నిర్ణయంతో వీరందరికీ వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఉదాహరణకు 2006 పే స్కేల్ ప్రకారం ప్రొఫెసర్ కు రూ. 37,400-రూ.67 వేల వరకు వేతనాలు ఉండగా.. ప్రస్తుతం సవరించిన పే స్కేల్ ప్రకారం వీరి వేతనం రూ. 1,44,200-రూ.2,18,200 వరకు పెరగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కు వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు... ఈ వార్త నిజంగానే ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది. సీఎం నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.