అంబేద్కర్ చిన్నప్పుడు చాలా దారుణమైన కుల వివక్షకు గురయ్యి ఎన్నో అవమానాలు పడ్డారు. అంబేద్కర్ మహర్ (దళిత) అనే కులంలో జన్మించారు.వీరిని అంటరానివారిగా చూసేవారు. అందుకే అంబేద్కర్ సామాజిక-ఆర్థిక వివక్షకు గురయ్యారు. అంబేద్కర్ పూర్వీకులు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చాలా కాలం పాటు పనిచేశారు. అంబేద్కర్ తండ్రి మోవ్ కంటోన్మెంట్ వద్ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. అంబేద్కర్ పాఠశాలకు హాజరైనప్పటికీ, ఇతర పిల్లలతో వేరు చేయబడ్డారు. అంబేద్కర్ తక్కువ కులానికి చెందిన వాడని ఉపాధ్యాయులు తక్కువ శ్రద్ధ చూపించి తక్కువ సహాయం అందించారు. కనీసం అంబేద్కర్ ని తరగతి లోపల కూడా కూర్చోనివ్వలేదు. ఆయన నీరు త్రాగవలసి వచ్చినప్పుడు, ఉన్నత కులానికి చెందిన వారు ఎవరు కూడా అంబేద్కర్ నీటి పాత్రను ముట్టడానికి అనుమతించేవారు కాదు. ఒక ప్యూన్ ఆ పాత్రని ఎత్తి అంబేద్కర్ దోసిళ్లలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకునేవాడు అంబేద్కర్. ఒక వేళ ఆ ప్యూన్ స్కూల్ కి రాకాపోతే, ఆరోజు అంబేద్కర్ నీళ్లు తాగేవాడు కాదు. అంతటి దారుణమైన కుల వివక్షకు గురయ్యాడు. అంట రానివాడని అంబేద్కర్ ని చాలా దారుణంగా చూసేవారు. ఇవన్నీ భరిస్తూ చదువు ఒక్కటే తనని బ్రతికిస్తుందనుకొని కష్టపడి చదివి నేడు మన రాజ్యంగాన్నే సృష్టించిన మహా మనిషి అయ్యారు.
అంబేద్కర్ చిన్నప్పుడు చాలా దారుణమైన కుల వివక్షకు గురయ్యి ఎన్నో అవమానాలు పడ్డారు. అంబేద్కర్ మహర్ (దళిత) అనే కులంలో జన్మించారు.వీరిని అంటరానివారిగా చూసేవారు. అందుకే అంబేద్కర్ సామాజిక-ఆర్థిక వివక్షకు గురయ్యారు. అంబేద్కర్ పూర్వీకులు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చాలా కాలం పాటు పనిచేశారు. అంబేద్కర్ తండ్రి మోవ్ కంటోన్మెంట్ వద్ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. అంబేద్కర్ పాఠశాలకు హాజరైనప్పటికీ, ఇతర పిల్లలతో వేరు చేయబడ్డారు. అంబేద్కర్ తక్కువ కులానికి చెందిన వాడని ఉపాధ్యాయులు తక్కువ శ్రద్ధ చూపించి తక్కువ సహాయం అందించారు. కనీసం అంబేద్కర్ ని తరగతి లోపల కూడా కూర్చోనివ్వలేదు. ఆయన నీరు త్రాగవలసి వచ్చినప్పుడు, ఉన్నత కులానికి చెందిన వారు ఎవరు కూడా అంబేద్కర్ నీటి పాత్రను ముట్టడానికి అనుమతించేవారు కాదు. ఒక ప్యూన్ ఆ పాత్రని ఎత్తి అంబేద్కర్ దోసిళ్లలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకునేవాడు అంబేద్కర్. ఒక వేళ ఆ ప్యూన్ స్కూల్ కి రాకాపోతే, ఆరోజు అంబేద్కర్ నీళ్లు తాగేవాడు కాదు. అంతటి దారుణమైన కుల వివక్షకు గురయ్యాడు. అంట రానివాడని అంబేద్కర్ ని చాలా దారుణంగా చూసేవారు. ఇవన్నీ భరిస్తూ చదువు ఒక్కటే తనని బ్రతికిస్తుందనుకొని కష్టపడి చదివి నేడు మన రాజ్యంగాన్నే సృష్టించిన మహా మనిషి అయ్యారు.