నేడు భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ (14 ఏప్రిల్ 1891 - 6 డిసెంబర్ 1956) జయంతి. ఈయన భారతీయ న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త మరియు రాజకీయ నాయకుడు. అంతేగాక రాజ్యాంగ అసెంబ్లీ,  న్యాయ మంత్రిగా న్యాయ శాఖ మంత్రిగా భారత రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి నాయకత్వం వహించారు. బాంబే విశ్వవిద్యాలయంలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాక, అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం ఇంకా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. అంబేద్కర్ వరుసగా 1927 మరియు 1923లో డాక్టరేట్‌లు అందుకున్నారు. 1920లలో ఇలాంటి ఘనత అందుకున్న కొద్దిమంది భారతీయ విద్యార్థులలో అంబేద్కర్ ఒకరు. ఆయన లండన్‌లోని గ్రేస్ ఇన్‌లో న్యాయశాస్త్రంలో శిక్షణ కూడా పొందారు. అంబేద్కర్ కెరీర్ ప్రారంభంలో ఆర్థికవేత్త, ప్రొఫెసర్ మరియు న్యాయవాదిగా పని చేసేవారు. ఆయన తరువాతి జీవితం రాజకీయ కార్యకలాపాల ద్వారా గుర్తించబడింది. అంబేద్కర్ విభజన కోసం ప్రచారం, చర్చలు, పత్రికలను ప్రచురించడం, దళితులకు రాజకీయ హక్కులు ఇంకా సామాజిక స్వేచ్ఛను సమర్ధించడం చేశారు. ఆయన కృషి భారతదేశ రాజ్య స్థాపనకు దోహదపడింది.1956 లో, అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారారు. దళితుల సామూహిక మత మార్పిడులను ప్రారంభించారు.1990లో అంబేద్కర్‌కు మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. అనుచరులు  జై భీమ్ అని ఆయన్ని గౌరవిస్తారు. అలాగే అంబేద్కర్ ని బాబాసాహెబ్ అనే పేరుతో కూడా సూచిస్తారు. దీని అర్థం "గౌరవనీయమైన తండ్రి".


అంబేద్కర్ చిన్నప్పుడు చాలా దారుణమైన కుల వివక్షకు గురయ్యి ఎన్నో అవమానాలు పడ్డారు. అంబేద్కర్ మహర్ (దళిత) అనే కులంలో జన్మించారు.వీరిని అంటరానివారిగా చూసేవారు. అందుకే అంబేద్కర్  సామాజిక-ఆర్థిక వివక్షకు గురయ్యారు. అంబేద్కర్ పూర్వీకులు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చాలా కాలం పాటు పనిచేశారు. అంబేద్కర్ తండ్రి మోవ్ కంటోన్మెంట్ వద్ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. అంబేద్కర్ పాఠశాలకు హాజరైనప్పటికీ,  ఇతర పిల్లలతో వేరు చేయబడ్డారు. అంబేద్కర్ తక్కువ కులానికి చెందిన వాడని ఉపాధ్యాయులు తక్కువ శ్రద్ధ చూపించి తక్కువ సహాయం అందించారు. కనీసం అంబేద్కర్ ని తరగతి లోపల కూడా కూర్చోనివ్వలేదు. ఆయన నీరు త్రాగవలసి వచ్చినప్పుడు, ఉన్నత కులానికి చెందిన వారు ఎవరు కూడా అంబేద్కర్ నీటి పాత్రను ముట్టడానికి అనుమతించేవారు కాదు. ఒక ప్యూన్ ఆ పాత్రని ఎత్తి అంబేద్కర్ దోసిళ్లలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకునేవాడు అంబేద్కర్. ఒక వేళ ఆ ప్యూన్ స్కూల్ కి రాకాపోతే, ఆరోజు అంబేద్కర్ నీళ్లు తాగేవాడు కాదు. అంతటి దారుణమైన కుల వివక్షకు  గురయ్యాడు. అంట రానివాడని అంబేద్కర్ ని చాలా దారుణంగా చూసేవారు. ఇవన్నీ భరిస్తూ చదువు ఒక్కటే తనని బ్రతికిస్తుందనుకొని కష్టపడి చదివి నేడు మన రాజ్యంగాన్నే సృష్టించిన మహా మనిషి అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: