తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్ సినిమాలు ఇప్పుడు గట్టిగా ఊపందుకున్నాయి. మొదటినుంచి అన్ని భాషల చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంకా ఇక్కడ తెలుగు సీమలో అయితే పెద్ద హీరోల ఫ్యాన్స్ కోరికలు, తమ హీరోల పాత్ర  వైవిధ్యంగా ఉండాలని, కొత్తగా తెరపైకి కల్పించాలని ఆశిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పటి మల్టీస్టారర్ ట్రెండ్ లో ఇద్దరు బడా హీరోలు ఒకేసారి తెరపై కనిపిస్తే ఇంకా అభిమానుల ఆనందాలకు ఆకాశమే హద్దుగా మారుతుంది.

 

 

ఇలాంటి తరుణంలో టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇద్దరూ కలిసి  ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారని, దీనికి నిర్మాతగా ప్రముఖ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఉండబోతున్నారని.. గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అరవింద్ ఇద్దరు హీరోల దగ్గర ఉన్న పరిచయం తో మాటామంతీ లు పూర్తిచేసి ఈ కథను సిద్ధం చేసుకుని వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టా లెక్కించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగు చిత్రసీమలో వినికిడి.

 

 

నిజంగా ఇదే జరిగితే ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఎందుకంటే ఒకరు క్లాస్ కు మరో పేరు అయితే, మరొకరు మాస్ కు బ్రాండ్ అంబాసిడర్... ఇలాంటి ఇద్దరు హీరోలు తలపై కనిపిస్తే ఇంక అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని పూర్తి చేసేంతవరకు నిద్రపోరు. చిన్న చిన్న సినిమాలకే ప్రొడ్యూస్ చేసి అనేక పెద్ద విజయాలు సాధించారు. అలాగే పెద్ద పెద్ద హీరోలతో బడా సినిమాలను నిర్మించి ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. మగధీర లాంటి భారీ సినిమాను తెరకెక్కించి అభిమానులకు పండగ వాతావరణాన్ని సృష్టించారు. అంతేకాకుండా తన పెద్ద కుమారుడు అల్లు అర్జున్ తో ఎన్నో సినిమాలు చేసి అభిమానులకు ఎంతో ఆనందాన్ని చేరువ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: