కరోనా చాలా మంది నిర్మాతలకి, దర్శకులకి, హీరోయిన్స్ కి కొత్త దారి చూపించింది. నిర్మాతలు ఇన్నాళ్ళు థియోటర్స్ ఓపెన్ అవుతాయని ఎదురు చూసి దిక్కు తోచని పరిస్థితుల్లో తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లలో అంటే బోల్డ్ అయినా ఒకే అని నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయంలో చాలామంది స్టార్ హీరోయిన్స్ సమంత లా డేరింగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. 

 

IHG

 

ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 లో నటించింది. ఇందులో సమంత నెగిటివ్ రోల్ పోషించిందని, ఈ పాత్ర అద్భుతంగా పోషించిందన్న ప్రశంసలు యూనిట్ నుంచి వస్తున్నాయి. సమంత లాగే కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయనుండగా త్రిష రీసెంట్ గా ఒక తమిళ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు వెల్లడించింది. తండ్రీ కూతురు మధ్య ఉన్న బంధం అన్న కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుండగా త్వరలో చిత్రీకరణ మొదలు కాబోతుందట. ఇప్పుడు ఈ లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది.

 

IHG

 

బాలీవుడ్ లో రూపొందబోయో ఒక వెబ్ సిరీస్ లో రకుల్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇద్దరి ట్విన్స్ మధ్య జరిగే సిరీస్ అని.. ఈ పాత్రలు ఛాలెంజింగ్ గా ఉంటాయని సమాచారం. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ ను విక్రమ్ అనే కొత్త వ్యక్తి దర్శకుడిగా పరిచయమవుతుండగా అక్టోబర్ నుండి షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. 

 

IHG

 

అయితే వెబ్ సిరీస్ లో నటించడానికి వరసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ అండ్ డిమాండ్ ఉన్న హీరోయిన్సే కావాలన్న రూల్ ఏమీ లేదని అర్థమవుతుంది. ప్రస్తుతం సమంత ఖాళీగానే ఉంది. జాను తర్వాత మరో సినిమా అనౌన్స్ కాలేదు. అలాగే త్రిష, రకుల్ ప్రీత్ సింగ్. ఈ హీరోయిన్స్ ఇద్దరికి టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. కాబట్టే వెబ్ సిరీస్ అనగానే వెంటనే కమిటవుతున్నారని తెలుస్తుంది. ఫాం లో ఉన్న కీర్తి సురేష్, పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇప్పటి వరకు ఒక్క వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: