నందమూరి నటసింహం బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యను అఘోరాగా చూపించి నందమూరి ఫ్యాన్స్‌కు ఎప్పుడూ చూడని బాలయ్యను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాపై తెగ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా.. ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమా టీజర్ ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో ఈ సినిమా పక్కా హిట్ అంటూ ఇప్పటికే టాక్ మొదలైంది. అయితే ఇదే సమయంలో ఇంతటి పవర్ ఫుల్ సినిమా తీసిన తర్వాత బోయపాటి ఇంకెవరితో సినిమా తీస్తాడా అని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బోయపాటి తన ఫస్ట్ సినిమా చేసిన మాస్ మహారాజా రవితేజతో తన నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట.

బోయపాటి ఫస్ట్ హీరో రవితేజ. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం బోయపాటి తన ఫస్ట్ సినిమా భద్రను రవితేజతోనే తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. బోయపాటితో పాటు రవితేజకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఇన్నేళ్ల తరువాత వీళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారనే వార్తలు రావడంతో అప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అంతేకాదు.. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందని, పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

కాగా.. ఇప్పటికే రవితేజ కోసం బోయపాటి ఓ ఫుల్ యాక్షన్ స్క్రిప్టును సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రవితేజ స్టైల్లో పక్కా కామెడీతో సాగుతూనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా ఉండబోతోందని టాక్.  అంటే దాదాపు ‘భద్ర’లానే రవితేజకి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడన్నమాట. మరో 3 నెలల్లో అఖండ సినిమా పూర్తి కానుండడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేనని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక రవితేజ ప్రస్తుతం రమేశ్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటితో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: