అశ్లీల వీడియోలను చిత్రీకరిస్తున్నారు అంటూ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రలే ఒక ప్రకటనలో మాట్లాడుతూ "అశ్లీల చిత్రాలను తీసి, కొన్ని యాప్స్ ద్వారా ప్రచురించడం గురించి ఫిబ్రవరి 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్ లో కేసు నమోదైంది. మేము మిస్టర్ రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసాము. ఇందులో అతను ప్రధాన నిందితుడుగా ఉన్నాడు" అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తన భర్త అరెస్టుకు ముందు శిల్పాశెట్టి కుంద్రా చేసిన చివరి సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ' మన చుట్టూ ఏమి జరుగుతుందో మార్చగల శక్తి మనకు ఎప్పుడూ ఉండకపోవచ్చు. కానీ లోపల ఏమి జరుగుతుందో మనం ఖచ్చితంగా నియంత్రించవచ్చు. అది యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనస్సును శాంతపరచడానికి, అవాంఛిత ఆలోచనలను తగ్గించడానికి, మీ దృష్టిని కేంద్రీకరించడానికి త్రటక్ ధ్యానం ద్వారా మీ దృష్టిని మెరుగుపరుచుకోండి" అంటూ పోస్ట్ చేసింది.


కాగా ఈ కేసులో శిల్పాశెట్టి పాత్ర ఏం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం వారు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ముందుకు వచ్చి క్రైమ్ బ్రాంచ్ ముంబైని సంప్రదించాలని, దానిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. పోర్న్ వీడియోల చిత్రీకరణ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలతో రాజ్ సహా 11 మందిని అరెస్టు చేశారు. మరోవైపు అశ్లీల చిత్రాల ద్వారా ఆయన సంపాదన, మోడల్స్ ను స్టార్స్ చేస్తామని చెప్పి వారితో న్యూడ్, సెమీ న్యూడ్ ఫోటోషూట్లతో పాటు పోర్న్ సినిమాలు చిత్రీకరించడం, వారిని ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు రాజ్ పాల్పడినట్టు ఇప్పటికే వెల్లడైంది. ప్రస్తుతం రిమాండ్ కు తరలించిన రాజ్ ను విచారిస్తున్నారు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: