నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ` చేస్తున్నారు. మాస్ సినిమాల స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉందని సమాచారం. దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. కాగా, `అఖండ` సినిమా విడుదలయ్యేలోపే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారట బాలయ్య. అంతేకాదు  గోపీచంద్ దర్శకత్వంలో వచ్చే  సినిమా నిర్మాణ దశలో ఉండగానే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఓ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకెళతారని సమాచారం. ఇదిలా ఉంటే బాలయ్య వయసు , ఇమేజ్ కి తగ్గట్టు అనిల్ రావిపూడి చేయనున్న ఈ సినిమాలో మరో హీరో పాత్రకి కూడా స్థానముందని సమాచారం. కాకపోతే ఆ సినిమాలో అది అతిథి తరహా వేషమని వార్త వినిపిస్తుంది. ఇందులో మెగా మేనల్లుడు అయిన హీరో సాయిధరమ్ తేజ్ నటించే అవకాశమున్నట్లు సమాచారం.


అయితే గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన `సుప్రీమ్' చిత్రంలో సాయిధరమ్ తేజ్ హీరో గా నటించాడు. ఆ సినిమా 2016 లో విడుదలయి మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఈ ఇద్దరు కలిసి పనిచేసింది లేదు.ఇదిలా ఉంటే సుమారు ఐదు సంవత్సరాలు తరువాత బాలయ్య సినిమా కోసం వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. మరి  బాలకృష్ణ చిత్రంలో సాయిధరమ్ తేజ్ అతిథిగా నటిస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందని వార్త వినిపిస్తుంది. ఇలా ఉండగా సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం అయిన `రిపబ్లిక్ సినిమా. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది అని సమాచారం. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జిల్లా కలెక్టర్ అయిన పంజా అభిరామ్ పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించినట్లు సమాచారం .లాఫింగ్ స్టార్, టవర్ స్టార్ అయిన నాగబాబుతో బాలయ్యకు గొడవ జరిగిన విషయం తెలిసిందే.నాగబాబు సాయిధరమ్ తేజ్ కు చిన్న మావయ్య అవుతాడు. మావయ్య అంటే చాలా ఇష్టమున్న సాయిధరమ్ తేజ్ ఆయనతో గొడవ పెట్టుకున్న బాలయ్య సినిమాలో నటిస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఎవ్వరు ఎమన్నా పట్టించుకోకుండా తన పంథాలో తాను పని చేసుకుంటూ వెళ్లిపోయే బాలయ్య బాబు ఈ సినిమాలో సాయిధరమ్ ని తీసుకోవడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: