హీరోయిన్ చార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత అనుకొని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమై.. మళ్లీ నిర్మాతగా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎంతో అందంగా, బొద్దుగా ఉండే చార్మి గ్లామరస్ పాత్రలతోపాటు, వైవిధ్యమైన నటనతో అందరినీ ఆకట్టుకునేది. సినిమాల్లో తనకు నచ్చిన పాత్రల్లో నటించడం.. అలాగే పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అయితే చార్మి పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ తెలియదనే చెప్పుకోవచ్చు.

అయితే చార్మి సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చిందనే విషయం కూడా తెలియదు. అయితే చార్మి 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన అన్నయ్యతో కలిసి గురుద్వార్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి వీరిని ఆపి.. ఒక సినిమాలో నటించేందుకు వస్తావా అని అడిగారని ఆమె తెలిపారు. దీంతో చార్మి తన అమ్మకు చెప్పి.. షూటింగ్ స్పాట్‌కు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. షూటింగ్ టైంలో అక్కడ దాదాపు ఐదు వేల మంది అమ్మాయిలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆ సినిమా ‘మే ప్రేమ్‌కి దివాని’ అని. మొదటిసారిగా ఆమె జూనియర్ ఆర్టిస్ట్‌ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినట్లు చార్మి పేర్కొన్నారు. ఆ పాత్రలో నటించినందుకు తనకు రూ.200 వచ్చాయని చార్మి తెలిపారు.

అయితే ఆ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ నటించాడని, తను ఫస్ట్ నుంచి అభిషేక్ బచ్చన్ వీరాభిమాని అని పేర్కొన్నారు. అయితే ఆ టైంలో అభిషేక్ బచ్చన్ నన్ను చూసి.. నువ్వు చాలా అందంగా ఉన్నావు.. హీరోయిన్‌గా రాణించవచ్చని తెలిపారన్నారు. ఆ మాటలు విన్న తనకు మతి పోయిందని చార్మి తెలిపారు. అయితే తన మొదటి సంపాదన భోజనానికే ఖర్చు అయిపోయాయని, రూ.3తో వడపావ్, రోజూ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లడానికి రూ.8 ఖర్చు అయ్యేదని, అలా ఏడు రోజులు షూటింగ్‌కు వెళ్లి రావడానికి రూ. వెయ్యి ఖర్చు అయిందన్నారు. అలాగే ఆ డబ్బులతోనే తన 8వ తరగతికి ఫీజు కట్టినట్లు చార్మి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: