సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా,  ఈ మూవీ కి గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వం వహించాడు. మే 12 వ తేదీన విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తూ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

 ఇలా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం నట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే...  సర్కారు వారి పాట సినిమా కోసం చిత్ర బృందం మురారి బావ అని ఒక సాంగ్ ను చిత్రీకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ ను ఈ మూవీ లో అడ్ చేద్దాము అని చిత్ర బృందం దాదాపుగా డిసైడ్ అయ్యింది. కాక పోతే చివరి నిమిషంలో ఈ సాంగ్ ను సినిమా నుండి తప్పించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సాంగ్ ను మూవీ లో అడ్ చేయబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి.

 కాకపోతే ఇప్పటి వరకు ఈ సాంగ్ ను మూవీ లో మాత్రం అడ్ చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మురారి బాబా సాంగ్ ను మే 31 వ తేదీన మూవీ లో ఆడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సాంగ్ ను మూవీ లో అడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమాలో సముద్ర ఖని ప్రతినాయకుడి పాత్రలో నటించగా,  వెన్నెల కిషోర్,  సుబ్బరాజు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: