కోలీవుడ్ ట్రెండింగ్ కపుల్ నయన తార, విఘ్నేశ్ శివన్ దంపతుల కు కవల పిల్లలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. తాము కవల మగ పిల్లలకు అమ్మా నాన్నలం అయినట్టు నయన తార భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ప్రకటించగానే ఆ విషయం వైరల్ అయిపోయింది.పెళ్లయి నాలుగు నెలలు కూడా కాలేదు.. అప్పుడే నయనతారకు పిల్లలేంటి.. అంటూ చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం గురించి తెలిసిన కొంత మంది.. సరోగసీ ద్వారా నయనతార, విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులు అయ్యారని వివరణ ఇస్తున్నారు.తాము పండంటి కవలలకు తల్లిదండ్రులమైనట్లు సోషల్ మీడియా వేది కగా ప్రకటించారు నయన్ విఘ్నేశ్  దంపతులు. " నయన్ మరియు నేను అమ్మ, అప్పగా మారాము. మాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలు అన్ని కలిపి మాకు 2 ఆశీర్వాద శిశువుల రూపంలో కలిసి వచ్చాయి. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ఉయిర్ అండ్ ఉలగమ్.. మీ రు మా జీవితంలో ఎన్నో వెలుగు లు నింపుతారని ఆశిస్తున్నాను. దేవుడు డబుల్ గ్రేట్" అని విఘ్నేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో షాక్ అయిన అభిమానులు కొద్దిగా తేరుకొని కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు.సుమా రు ఏడేళ్ల నుంచి ప్రేమ లో ఉన్న ఈ జంట కుటుంబసభ్యుల సమక్షంలో మహాబలిపురంలో జూన్‌ 9న పెళ్లి బంధంతో ఏకమయ్యింది. మహాబలిపు రంలో అంబరాన్ని అంటేలా ఓ సుందరమైన పెళ్లి వేదికలో జరిగిన ఈ కళ్యాణ వేడుక డాక్యు మెంటరీ రూపంలో త్వరలోనే నెట్టింట్లో సం దడి చేయనుంది. దసరాకు విడుదలైన 'గాడ్‌ ఫాదర్‌'తో విజయాన్ని అందుకున్న నయన్.. తర్వాత విఘ్నేశ్‌ దర్శక త్వం లో అజి త్‌ సరసన ఓ సినిమా చేయ నున్నారని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: