మోస్ట్ బ్యూటిఫుల్ , అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయిన కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కత్రినా కైఫ్ తన కెరీర్ ప్రారంభంలో తెలుగు లో మల్లీశ్వరి , అల్లరి పిడుగు వంటి మూవీ లలో నటించింది. ఈ మూవీ లలో మల్లీశ్వరి మూవీ అద్భుతమైన విజయం సాధించింది. దీనితో కత్రినా కైఫ్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్లీశ్వరి ,  అల్లరి పిడుగు వంటి సినిమాలలో నటించిన కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం ,  అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయాలను సాధించడంతో ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా కత్రినా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా  కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కత్రినా కైఫ్ ,  విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కత్రినా కైఫ్ తన పెళ్లి తర్వాత ఫోన్ బూత్ అనే మూవీ లో నటించింది.

మూవీ ప్రమోషన్ లలో భాగంగా తాజాగా కత్రినా కైఫ్ ,  సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ 3 మూవీ లో నటించడం గురించి స్పందిస్తూ ... టైగర్ 3 మూవీ లో సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయనుండడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని కత్రినా కైఫ్ తాజాగా పేర్కొంది. ఇది వరకే సల్మాన్ ఖాన్ ,  కత్రినా కైఫ్ కలిసి టైగర్ జిందా హై  , ఏక్ థా టైగర్ మూవీ లలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: