ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌కు లైగర్‌ సినిమా డిస్ట్రిబ్యూటర్ల కు మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. మొన్నీమధ్య ఇదే విషయానికి సంబంధించి పూరీ జగన్నాథ్‌ ఆడియో లీక్‌ అయింది. తాజాగా, లైగర్‌ డిస్ట్రిబ్యూటర్లు అయిన వరంగల్‌ శ్రీను, శోభన్‌లపై పూరీ కేసు కూడా పెట్టారు. తనను ఆ ఇద్దరూ వేధిస్తున్నారంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వారిద్దరిపై ఫిర్యాదు చేశారు. శ్రీను, శోభన్‌లనుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు! వారినుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందని, ముందస్తు భద్రత కల్పించాలని కోరారట m.

కాగా, విజయ్‌ దేవర కొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్‌. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న ప్రేక్షలకు ముందుకు వచ్చింది. అయితే, అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్లు భారీ గా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్‌ తన రెమ్యూనరేషన్‌లో చాలా భాగాన్ని తిరిగి ఇచ్చేశారు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు చెల్లించటానికి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే పూరీకి, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వివాదం మొదలైంది. పూరీ డిస్ట్రిబ్యూటర్లకు వార్నింగ్‌ ఇచ్చారంటూ ఓ ఆడియో వెలుగులోకి వచ్చిందట.

ఆ ఆడియోలో : తాను ఎవ్వరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని పూరీ అన్నారు. నష్టపోయారన్న కారణంతోనే డబ్బులు తిరిగి ఇస్తున్నానన్నారు. తాము ఇప్పటికే బయ్యర్స్‌తో మాట్లాడామని, ఒక అమౌంట్ ఇస్తామని చెప్పామన్నారు. వాళ్లు ఒప్పుకున్నారని, ఒక నెల సమయం అడిగానన్నారు. తనకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని, అవి వచ్చాక ఇస్తానని చెప్పానన్నారు. మాట ఇచ్చిన తరవాత కూడా ఓవర్ యాక్షన్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధికాదని తెగేసి చెప్పారు. పరువు కోసం ఇస్తున్నానని, తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వనని స్పష్టం చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: