సాధారణంగా సినీ పరిశ్రమలో  ప్రేమ జంట పెళ్లి పీటలెక్కడం మనం చూస్తుంటాం... ఇదిలావుంటే ఇక తాజాగా ఇప్పుడు కొద్దికాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు మూడు మూళ్లు బంధంతో ఒక్కటి కాబోతున్నట్లుగా సమాచారం.అంతేకాదు వచ్చే నెలలో  బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల పెళ్లి అంగరంగా వైభవంగా ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇక   బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లికి సినీ ప్రముఖులు మాత్రమే హజరు కానున్నారని.. 

ఇక ముంభైలో జరిగే రిసెప్షన్ కు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వీరి వివాహం చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో జరగనుందని టాక్ నడుస్తోంది.ఇకపోతే ముందుగా వీరిద్దరు తమ వివాహాన్ని గోవాలో సిద్ధార్థ్ కుటుంబసభ్యుల సమక్షంలో పంజాబీ సంప్రదాయంలో నిర్వహించాలని భావించారని.. అనివార్య కారణాలతో చంఢీగడ్ కు మార్చినట్లుగా సమాచారం.అయితే  ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సిద్ధార్థ్.. కియారాతో ప్రేమ, పెళ్లి గురించి పరోక్షంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

అంతేకాకుండా ఇక  స్టార్ హీరో షాహిద్ కపూర్ కియారా తో కలిసి కాఫీ విత్ కరణ్ షోకి విచ్చేసినప్పుడు  బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల వివాహం డిసెంబర్ లో జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.అయితే ప్రస్తుతం కియారా అద్వానీ.. డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ అంజలి కీలకపాత్రలో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: