నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మరో మూవీ ని కూడా స్టార్ట్ చేశాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొంద బోతుంది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నా బాలకృష్ణ ప్రస్తుతం ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ టాక్ షో ఒక సంబంధించిన కొన్ని ఎపిసోడ్ లు విడుదల కూడా అయ్యాయి. 

వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే మరి కొన్ని రోజుల్లో ప్రభాస్ మరియు గోపీచంద్ లకు సంబంధించిన ఎపిసోడ్ ని కూడా ఆహా నిర్వాహక బృందం విడుదల చేయబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో లో భాగంగా మరో ఎపిసోడ్ కు సంబంధించిన అప్డేట్ ను ఆహ నిర్వాహక బృందం తాజాగా ఇచ్చింది. తాజాగా ఆహా నిర్వాహక బృందం అలనాటి సీనియర్ స్టార్ హీరోయిన్ లు అయినటు వంటి జయసుధ , జయప్రద మరియు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రాసి కన్నా ఆన్ స్టాపబుల్ టాక్ షో కు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆహ నిర్వాహక బృందం విడుదల చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: