పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిధి అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ వరుస పెట్టి తన తదుపరి మూవీ లకు సంబంధించిన అప్డేట్ లను వదులుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి కమిట్ అయ్యాడు. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు  అలాగే సముద్ర ఖని దర్శకత్వం లో వినోదయ సీతం అనే తమిళ రీమిక్ మూవీలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఇలా అంటే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూవీలలో మొదటగా వినోదయ సీతం మూవీని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనుండగా యంగ్ హీరో సాయి దరమ్ తేజ్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్మూవీ షూటింగ్ లో వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పార్టీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సాయి దరమ్ తేజ్ ప్రస్తుతం వీరుపాక్ష అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: