బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ తన అందం తన నటనతో టాప్ యాంకర్ల ప్లేస్లో ఉంది యాంకర్ అనసూయ. చాలా తక్కువ కాలంలోనే స్టార్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది ఈమె. న్యూస్ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె దాని తర్వాత ఈవెంట్లు చేసేది.దాంతో జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం రావడంతో యాంకర్ గా తన అద్భుతమైన హోస్టింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకుంది. అలా జబర్దస్త్ తో మంచి గుర్తింపు పొందింది అనసూయ. దాని అనంతరం సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 

దాని అనంతరం క్షణం రంగస్థలంలో నటించింది. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది ఈమె. నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం రంగమార్తాండ వేదాంతం రాఘవయ్య గాడ్ ఫాదర్ హరి హర వీరమల్లు పుష్ప 2 , భోళాశంకర్ వంటి పాన్ ఇండియా సినిమాల్లో సైతం నటిస్తోంది అనసూయ. అలా ఒకవైపు సినిమాలో మరోవైపు జబర్దస్త్ తో బిజీగా ఉన్న సమయంలో ఎవరు ఊహించిన విధంగా జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పింది అనసూయ. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాని అనంతరం ఈటీవీ కి గుడ్ బై చెప్పిన అనసూయ..

స్టార్ మాలోకి సుడిగాలి తో కలిసి యాంకర్ గా వ్యవహరించిన ఆ షో పూర్తయిన తర్వాత నుండి మళ్ళీ షోలలో కనిపించడం లేదు. అనసూయ జబర్దస్త్ మానేయడానికి తన పర్సనల్ కారణాల ఉన్నాయని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనసూయ జబర్దస్త్ మానేయడానికి కారణం తన ఇద్దరు కొడుకులు అని తెలుస్తుంది. తన ఇద్దరు కొడుకుల కోరిక మేరకు ఈ షా నుండి తప్పకుంది అనసూయ. వాళ్ళతో సమయం గడపడం కుదరడం లేదని వాళ్లతో పూర్తి సమయం గడపాలని అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: