టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఐతే ఇందులో దేవ్ మోహన్, మోహన్బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. వీరితోపాటుగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా బాలనటిగా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

దాంట్లో భాగంగా గానే ఇప్పటికే ప్రమోషన్స్ ని షురూ చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మోహన్బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. మహర్షిగా ఆయన లుక్ అదిరిపోవడంతో పాటు లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రేపు అనగా మార్చి 19వ తేదీన మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా రెండు రోజుల ముందే మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. కాగా శకుంతల, దుష్యంత్ ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, గుణా టీమ్ వర్క్ పతాకాలపై దిల్రాజు, నిలిమా గుణ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని సమంత అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాని విజువల్ వండర్గా తీర్చిదిద్దారు దర్శకుడు గుణశేఖర్. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. విడుదలైన పాటలు వినసొంపుగా, అద్భుతంగా ఉన్నాయి. ఐతే ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్ 14న విడుదల కానుంది.

మాయొసైటీస్ నుండి కోలుకున్నాక సమంత నుండి వస్తున్నా మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాలని నేటిజన్లు అలాగే సమంత అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: