పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన్న.. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా కెరియర్ లో ముందుకు సాగుతూ ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అటు సౌత్ లో సైతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2 లో నటిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కోలీవుడ్ లో కూడా వరుసగా ఛాన్సులు దక్కించుకుంటుంది. అయితే ఈ అమ్మడు తన అందం అభినయంతో ఇప్పటికే నేషనల్ క్రష్ గా ప్రత్యేకమైన గుర్తింపులో సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవంలో తమన్నా భాటియాతో కలిసి రష్మిక మందన్న సందడి చేసింది. ఇక ఐపీఎల్ వేదికపై తమ అభిమాన నేషనల్ క్రష్ ను చూసి అభిమానులందరూ కూడా ఎంతగానో మురిసిపోయారు. ఇకపోతే ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తన ఫేవరెట్ జట్టు ఏంటి అన్న విషయాన్ని మనసులోని మాట బయట పెట్టింది అని చెప్పాలి. అంతేకాదు తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అన్న విషయాన్ని కూడా చెప్పేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన ఈ వ్యాఖ్యలు చేసింది.



 నేను కర్ణాటక నుంచి వచ్చాను. ఇక ఈసారి తప్పకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలుస్తుందని ఆశిస్తున్నాను. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఆర్సిబి జట్టు ఆటను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కాదు విరాట్ కోహ్లీ అంటూ రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. కోహ్లీ ఒక స్వాగర్, అతను ఒక అద్భుతం అంటూ ప్రశంసలతో కోహ్లీని ఆకాశానికి ఎత్తేసింది. ఇకపోతే ప్రస్తుతం రష్మిక దేవ్ మోహన్ తో కలిసి రెయిన్ బో చిత్రంలో నటిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక పుష్ప షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో మరో సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: