పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా విడుదలకు ముందే వివాదాలలో చిక్కుకుంది. ముందుగా ఈ సినిమాలోని పాత లుక్స్ విషయంలో వివాదం జరిగింది అనంతరం ట్రైలర్ విడుదలైన తర్వాత అందులోని సన్నివేశాల విషయంలో కూడా వివాదం జరిగింది. ట్రైలర్ విడుదలైనప్పటినుండి అభిమానులతో సహా పలువురు ఆది పురుష్ సినిమాలోని తప్పులు వెతికే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఇప్పుడు ట్రైలర్ లోని సన్నివేశాలను షేర్ చేసి మరి చిత్రీకరణలోని లోటుపాట్లని చెబుతున్నారు. తాజాగా ఇప్పుడు హనుమంతుడు ఎగురుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ఆ పోస్టర్లో అపార్ట్మెంట్స్ పెద్దపెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోని రామాయణ కాలంలో ఇంత ఎత్తైన భవనాలు ఉన్నాయా అంటూ.. ట్రైలర్ ని చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు కొంచెం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ట్రైలర్ లో చూపించిన ఒక సన్నివేశంలో హనుమంతుడు ఎదురుతున్న సమయంలో పక్కన ఉన్న ఎత్తైన భవనాలు కనిపించాయి. రామాయణ కాలం ప్రకారం ఇలాంటి లాజిక్ గా అనిపించదు. దీంతో ఈ పోస్టర్ పై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నేటిజన్స్. ఈ క్రమంలోనే ఒక నటిజన్స్ స్పందిస్తూ..

 ఇది ఆధునిక రామాయణం ఇంకొకరు ఎక్కడి నుండి ఇలాంటి ఆలోచనలు చేశారో తెలియదు కానీ ఈ పోస్టర్ ను చూస్తే మాత్రం హాలీవుడ్ పోస్టర్ ని కాపీ చేసి ఎడిట్ చేయడం మర్చిపోయారేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు..ఇక మరికొందరు ఈ అంశం లో చాలా సరదా విషయం ఏంటంటే బడ్జెట్ 600 కోట్లని గుర్తు చేస్తున్నారు.. మరికొందరైతే అది రావణుని అపార్ట్మెంట్ కావచ్చు అంటూ పేర్కొంటున్నారు. ఇక విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: