ప్రస్తుత కాలంలో ఎక్కువగా చాలామంది ప్రజలు నిరుద్యోగులు యువత సైతం పలు రకాల బిజినెస్ వైపుగా అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నారు. మరి కొంతమంది ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొకవైపు బిజినెస్ వైపుగా అడుగులు వేసి భారీగానే సంపాదిస్తున్నారు. మరి ఇలాంటి బిజినెస్లను ఎవరైనా సరే మొదలు పెట్టాలనుకునే వారికి కొన్ని చక్కటి అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.


1). ఐస్ క్రీమ్ సేల్స్:
ఇప్పుడు ఉన్న బిజీ యుగంలో ప్రజలు కాసేపైన కూర్చొని రిలాక్స్ గా ఏదైనా తిండాలనుకుంటే కచ్చితంగా ఐస్ క్రీమ్ పార్లర్ లో బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారు. స్కూల్ కాలేజీలలో ఉండే ఏరియాలలో చిన్నపాటి ఐస్ క్రీమ్ పార్లర్ ని ఓపెన్ చేస్తే.. అలాగే రెస్టారెంట్ లాగా కొంతమంది వచ్చి కూర్చొని తినడానికి తగినంత స్థలం ఉంటే చాలు మంచి లాభాలను అందుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల సైతం వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. వీటితోపాటు కూల్ డ్రింక్ కూడా షాప్ లో పెట్టుకుంటే ఈ బిజినెస్ కు మరింత లాభదాయకంగా ఉంటుంది అలాగే బేకరీ ఐటమ్స్, స్నాక్స్ వంటి వాటిని కూడా సేల్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ నిల్వ ఉంచడానికి కేవలం ఫ్రిడ్జ్ ఉంటే చాలు.


వాస్తవానికి బిజినెస్ అంటేనే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుని చాలామంది అనుకుంటారు. కానీ వాడిపోయిన పూలతో బిజినెస్ అనగానే చాలామందికి అనుమానం ఉండవచ్చు. అయితే ఎండిన పూలతో అగర్బత్తిలు వంటివి తయారు చేస్తే భారీగానే చాలామంది సంపాదిస్తున్నారు.. ఇది రీసైక్లింగ్ బిజినెస్ అని కూడా చెప్పవచ్చు..ప్రస్తుతం పువ్వులు నిత్య జీవితంలో ఒక భాగంగా మారాయి. చాలామంది గుడికి వెళుతున్న స్త్రీలు అలారంకరించుకోవాలన్న పలు కచ్చితంగా అవసరం. దేవాలయాలలో కూడా ఎక్కువగా పువ్వులు వినియోగిస్తూ ఉంటారు. అలా రెండు రోజుల తర్వాత వీటిని బయట పడేస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఉపయోగించి.. పలు రకాల అగర్బత్తిలను తయారు చేయడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు. వాడిపోయిన పూలను ఉపయోగించి భరత్ బన్సాల్ అనే వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారట.. అగర్బత్తిలతోపాటు ధూపం వంటి ఉత్పత్తులను తయారు చేస్తూ దేశంలో అంతట విక్రయిస్తూ ఉండగా వీరికి ఏడాదికి రూ.2.6 కోట్ల రూపాయలు ఆదాయాన్ని పొందుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: