ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. 'ఇస్మార్ట్ శంకర్' ను జులై 12 వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా ఫిలిం మేకర్స్ పూరీ, ఛార్మీ అధికారికంగా ప్రకటించారు.
అటు పూరీ డైరెక్ట్ చేసిన సినిమాలు, ఇటు రామ్ నటించిన సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. అందుకే ఈ ఇద్దరికి ఇప్పుడూ ఓ భారీ హిట్ కావాలి. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధీ అగర్వాల్ కి కూడా ముందు రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాబట్టి వీళ్ళతో పాటు నిధీకి మాంచి కిక్కిచ్చే హిట్ కావాలి. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మూడు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందని సమాచారం. ఈ పాటల చిత్రీకరణ పూర్తి కాగానే ప్రమోషన్స్ లో జోరు పెంచుతారట.
ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్.. నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. పూరి జగన్నాధ్.. ఛార్మీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి రూపొందించిన సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశపరుస్తున్నాయి. మరి ఈ డబల్ దిమాక్ హైదరాబాది రామ్ క్యారెక్టర్ తో ఈసారి హిట్ సాధిస్తాడా అనేది వేచి చూడాలి.