పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను పాలిటిక్స్ ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఉదయం సినిమా షూటింగ్.. సాయంత్రం రాజకీయాలు చేస్తూ నెల రోజులుగా కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చాడు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ లాయర్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. కొన్ని రోజులుగా ఈ రెండు సినిమాల షూటింగ్ తో పాటు రాజకీయంతో పవన్ బాగా అలసినట్టున్నాడు. అందుకే షూటింగ్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చాడు. 

 

తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు ఐదు రోజుల పాటు బ్రేక్ ఇచ్చాడట. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే రాజకీయ భేటీలో పవన్ ఈ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 18వ తేదీ నుండి మళ్లీ షూటింగ్ జాయిన్ అవుతాడని సమాచారం. లాయర్ సాబ్ సినిమాకు కేవలం 28 రోజులే డేట్లు కేటాయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పవన్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని టాక్. 

 

లాయర్ సాబ్ కంప్లీట్ కాగానే హరీశ్ శంకర్ తో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నాడట. క్రిష్ సినిమాకు సమాంతరంగా హరీశ్ శంకర్ సినిమాను ఏకకాలంలో పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడట. ఈ రెండు సినిమాలకు సంబంధించి బల్క్ కాల్ షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పింక్ రీమేక్ లాయర్ సాబ్ సినిమాను మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు  వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: