తమిళ, తెలుగు సీనియర్ నటీమణి, నేషనల్ అవార్డు విన్నర్ సుహాసిని ని విలక్షణ దర్శకుడు ఐన మణిరత్నం తన మూడు పదుల వయసులో కలుసుకున్నాడు. ఐతే మణిరత్నం సుహాసిని మధ్య స్నేహం ఏర్పడగా... ఒకానొక రోజు సుహాసిని అతడితో మాట్లాడుతూ... 'చూడండి మణిరత్నం గారు. నేను చాలా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను. పెళ్లి కాకుండా వేరే వ్యక్తి తో లింక్ పెట్టుకోలేను. నాకు ఎటువంటి రిలేషన్ లో అడుగుపెట్టాలనే ఆలోచన లేదు. పెళ్లి మాత్రమే చేసుకుంటా' అని అమాయకంగా చెప్పేసిందట. దాంతో ప్రత్యామ్నాయ చాయిస్ ఏమీ లేక సరే అనేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు మణిరత్నం.


వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందని తెలిసి అప్పట్లో తెలుగు తమిళ సినీ ప్రముఖులు అంతా ఆశ్చర్యపోయారు. 1988లో వీరి పెళ్లి కాగా... అప్పటికే సుహాసిని అగ్రహీరోలందరితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి అశేషమైన కీర్తిని గడించింది. ఆమె ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ... ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. డైరెక్టర్ మణిరత్నం ని వివాహం చేసుకున్న అనంతరం తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి అని చెబుతోంది సుహాసిని. 2018వ సంవత్సరంలో దర్శక దిగ్గజం కె.బాలచందర్ ఒత్తిడి వల్లనే తాను పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. కె.బాలచందర్ తన సోదరి పెళ్లి చేస్తున్నప్పుడు... తనని కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడట.


ఏది ఏమైనా వీళ్లిద్దరి వివాహమయ్యి 32 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ వారి బంధం దృఢంగానే ఉంది. ఇందుకు కారణం ఏమిటని సుహాసిని ని ప్రశ్నిస్తే... మణిరత్నం తనకు ఎంతో స్వేచ్ఛ ఇస్తాడు అని చెప్తుంది. పట్టు చీరలు కట్టమని, పువ్వులు పెట్టుకోమని మణిరత్నం తనని బలవంతం చేస్తాడని అంతే తప్ప మిగతా ఏ విషయాల్లో తన వ్యక్తిగత అభిప్రాయాలకు వ్యతిరేకత చూపడని ఆమె తెలిపింది. ఇకపోతే వారికి ఒక్కగానొక్క కొడుకు అయిన నందన్ 1992 లో జన్మించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: