తెలుగు ఇండస్ట్రీలో జర్నీ సినిమాతో పరిచయమైన హీరో జై తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ఆ తర్వాత రాజా రాణి సినిమాలో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించి అమాయకత్వపు కూడిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ఇక ఈ హీరో తమిళంలో చాలా హిట్లు సొంతం చేసుకున్నాడు. చాలా రోజులుగా జై సినిమాలకు కాస్త బ్రేక్ వేసాడు అనే చెప్పాలి. వరుసగా ప్లాప్ కావడంతో కాస్త సినిమాలు తీయడం తగ్గించాడు. 

 

 

ప్రస్తుతం లాక్ డౌన్ సమయం అవ్వడంతో ఇంటికి పరిమితమైన జై డిజిటల్ ప్లాట్ ఫాం పై దృష్టి పెట్టాడు. చాలా రోజులుగా సక్సెస్ సినిమాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న జై వెబ్ సిరీస్ లోకి రావడానికి సిద్ధం అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లాక్ డౌన్ సమయాన్ని స్క్రిప్ట్స్ వినడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడట. ఇటీవల జై అభిమానులకు ఒక మంచి శుభవార్త తెలియ చేశాడు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అసోసియేట్ డైరెక్టర్ దర్శకత్వంలో రాబోతున్న వెబ్ సిరీస్ లో నటించడానికి జై సిద్ధమయ్యాడు అట. ఈ వెబ్ సిరీస్ ని స్టోన్ బెంజ్ ప్రొడక్షన్స్ నిర్మాతగా వహిస్తుంది. 

 


ఇక ఈ వెబ్ సిరీస్ లో జై తో జత కట్టడానికి ఓహ్ మై కడావులే" చిత్రంతో సంచలనాత్మక సినిమా అరంగేట్రం చేసిన తరువాత వాణి భోజన్ చేయబోవుతుంది. ఇక ఈ బ్యూటీ గత ఏడాది విడుదలైన 'నీయా 2' , కామెడీ కాప్మారీ చిత్రం కూడా మంచిగా హిట్ దక్కించుకుంది.  కాకుండా ఈ బ్యూటీ మన తెలుగులో ' మీకు మాత్రమే చెప్తా ' అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం జై తో కలిసి వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమైంది అనే విషయం అభిమానులకు ఒక శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: