ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ 4 బుల్లితెర ప్రేక్షకులందరికీ ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఎవరికీ తెలియని సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా తీసుకో వచ్చినప్పటికీ ఎంతో తెలివిగా హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు ఉన్నాయి అనే కెమెరాల ద్వారా ఫోకస్ చేసి బుల్లితెర ప్రేక్షకులందరికీ చూపించడంతో రోజురోజుకు బుల్లితెర ప్రేక్షకులు అందరూ బాగా ఆకర్షితులు అయిపోయారు. దీంతో ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది బిగ్బాస్ తెలుగు సీజన్ 4.



 వారంలో ఐదు రోజుల బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు చేసే సందడి జరిగే కాంట్రవర్సీలు... ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు అన్నీ కూడా బుల్లితెర ప్రేక్షకులందరిని  టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వారాంతంలో వచ్చే నాగార్జున రెండు రోజుల పాటు చేసే  సందడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్ మెట్స్ అందరితో వివిధ రకాల స్కిట్ లు చేయిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు అంతకుమించి అనేంత రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారూ  నాగార్జున. ఇటీవలే షూటింగ్ లో బిజీగా ఉండడంతో అక్కినేని వారి కోడలు సమంత బిగ్ బాస్ హౌస్ లోకి హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం తో బిగ్ బాస్ రేటింగ్ మరింతగా పెరిగిపోయింది.



 ఇక బిగ్ బాస్ హౌస్ లో విజేత గా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక తాజాగా ఇదే ఈ విషయంపై స్పందించిన బిగ్ బాస్ 2 సీజన్ విజేత కౌశల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ 4 సీజన్ కన్నా బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఎంతో రసవత్తరంగా ఉంది అంటూ కామెంట్ చేశాడు కౌశల్.  ఈ  బిగ్ బాస్ సీజన్ లో నిర్వాహకులు పాత టాస్క్  లనే పెడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక గత బిగ్ బాస్ సీజన్ లో ఉన్న కొన్ని లవ్ ట్రాక్ లనే ఈ సీజన్లో కూడా అప్లై చేయాలని బిగ్బాస్ ప్రయత్నించాడని..  అఖిల్ మోనాల్ అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలతో అదే ప్రయత్నం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు.  కానీ అది అంతగా కలిసిరాలేదని.. అయితే ఈ సీజన్లో బిగ్బాస్ మహిళా విజేత ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: