రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా 'పుష్ప'..అల్లు అర్జున్ కథానాయకుడు...ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిపోయే ఈ సినిమా  వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమా కాగా మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు.. రంగస్థలం లాంటి హిట్ కొట్టిన సుకుమార్ కి ఇది ఒక అగ్ని పరీక్ష ల మారిందని చెప్పొచ్చు..ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరినుంచి సుక్కు కు ఏదీ కలిసి రావట్లేదు అని చెప్పాలి...

అన్ని బాగుంటే ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేసి రిలీజ్ చేయాల్సి ఉండేది. కానీ విధి ఆడిన నాటకంలో మహేష్ సుకుమార్ కి హ్యాండ్ ఇవ్వడం సుకుమార్ తనకు అచ్చోచ్చిన హీరో అయిన అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమా కి విలన్ సమస్య ప్రధానంగా ఉంది అని చెప్పొచ్చు.. మొదటినుంచి అనుకున్నట్లు సినిమా విలన్ పై రోజు కో పేరు వినిపిస్తుంది..  ఇప్పటికే ఈ సినిమా కి విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు.. ఇప్పటివరకు ఎవరు కూడా ఆ పాత్రకు ఫిక్స్ కాలేదు..

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ తో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. దీనిపై ఇటీవలే ఓ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాతి సినిమా కూడా సుకుమార్ నెక్స్ట్ సినిమా ని లైన్ లో పెట్టుకున్నాడట. లేటెస్టుగా సుకుమార్ తోనూ మ‌హేష్ ట‌చ్‌లోకి వెళ్లాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రి కాంబోలో `నేనొక్క‌డినే` వ‌చ్చింది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఆ ప్ర‌య‌త్నం నిరాశ ప‌రిచినా – క్రిటిక్స్ మ‌న‌సుల్ని గెలుచుకుంది. సుకుమార్‌పై మహేష్ న‌మ్మ‌కం స‌డ‌ల్లేదు. అందుకే సుక్కుతో మ‌రో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో మ‌హేష్ కి స‌రిప‌డా ఓ లైన్ సిద్ధం చేశాడ‌ట సుకుమార్‌. `పుష్ఫ‌` అయ్యాక‌… విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్సినిమా చేయాలి. ఆ త‌ర‌వాతే.. మ‌హేష్ ప్రాజెక్టు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: