రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు ఎంచుకుంటూ మంచి జోరుతో కొనసాగుతున్నారనే చెప్పాలి. ఇప్పటికే ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో తాను ఒప్పుకున్న తదుపరి మూడు సినిమాలపై దృష్టి పెట్టారు ప్రభాస్. ముందుగా వాటి లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా సలార్. కే జి ఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలింస్ బ్యానర్ పై అత్యంత భారీ ఖర్చుతో పాన్ ఇండియా మూవీ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీపై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఇక నిన్న ఈ సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం ఎంతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కే జి ఎఫ్ సినిమాహీరో యాష్ ఈ ఫంక్షన్ కి ప్రత్యేక అతిథిగా విచ్చేసి హీరో ప్రభాస్ కి, మూవీ యూనిట్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. దాదాపుగా రూ. 650 కోట్ల భారీ ఖర్చుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మరియు శాండల్వుడ్ కు చెందిన పలువురు దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. తన కెరీర్లో తొలిసారిగా ప్రభాస్ ఒక పక్కా మాస్ రోల్ ని ఈ సినిమాలో పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతో వైలెంట్ గా ఉండటంతో పాటు ఆయన పాత్రకు ధీటుగా విలన్ గా క్యారెక్టర్స్  కూడా ఉంటాయని సమాచారం.

ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇందులో ఒక లేడీ విలన్ క్యారెక్టర్ ఉందని ఆ పాత్రకు గాను నటి వరలక్ష్మి శరత్ కుమార్ ని ఇటీవల మూవీ యూనిట్ ఎంపిక చేసిందని సమాచారం. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయి సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తున్న రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ లో జయమ్మ అనే నెగటివ్ పాత్రలో నటించి మంచి పేరు దక్కించుకున్న వరలక్ష్మి అయితేనే ఈ క్యారెక్టర్ కి బాగుంటుందని ఆమెని సెలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. అలానే ఈ సినిమాలోని పలు ఇతర పాత్రలకు సంబంధించిన ఇతర నటుల ఎంపిక కూడా ఆల్మోస్ట్ పూర్తయిందని అతి త్వరలో వీటికి సంబంధించి అధికారికంగా సమాచారం కూడా రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరికొద్దిరోజుల వరకు వెయిట్ చేయక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: