ఈటీవి లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న డ్యాన్స్ షో ఢీ.. ఎక్కడెక్కడి నుంచో తమలోని టాలెంట్ ను బయట పెట్టడానికి ఈ ప్రోగ్రాం చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే 13 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో పద మూడో షో ను జరుపుకుంటుంది. కాగా ఈ షో ఎంత సక్సెస్ రేటును అందుకుందో అంతకు మించి విమర్శలు కూడా అందుకుంది. తాజాగా యాంకర్ సుమ ఈ షో పై సంచలన కామెంట్స్ చేసింది..అవి కాస్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.



విషయానికొస్తే.. సుమ చేసే షో లలో వచ్చే వాళ్ళ పై వేసే కుల్లు జోకు లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి .. దాంతో షో మరింత హిట్ అవుతూ వచ్చింది.ఢీ కంటెస్టెంట్ లు, మాస్టర్లు సుమతో ఆడేందుదుకు షో కి వచ్చారు. తేజస్విని, సుదర్శన్, ఐశ్వర్య, మనోజ్, చైతన్య వంటివారు రాగా వారందరినీ సుమ ఒక ఆట ఆడుకుంది. ఐశ్వర్య కు అయితే సుమ పరువు తీసి మరీ పంపించింది. ఇండస్ట్రీ కి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు హీరోయిన్ అవుదామని వచ్చాను అని ఐశ్వర్య చెప్పింది.. సుమ వేసిన కౌంటర్లు మాములుగా లేవు. షో మొత్తం నవ్వులు పోయానున్నాయి.



అలాగే మరొక రౌండ్ లో భాగంగా మాస్టర్ లను ఒకవైపు కంటెస్టెంట్ లను మరొకవైపు కూర్చోబెట్టిన సుమ అందులో భాగంగా ఢీ విషయాల గురించి గురించి ప్రశ్నించింది. షో లో కంటెస్టెంట్లకు, మాస్టర్ కు మధ్య అఫైర్స్ ఉన్నాయంటూ సుమా వారిని ప్రశ్నించగా ఒక్కసారిగా బిత్తరపోయిన మాస్టర్లు కవర్ చేసుకునేందుకు ట్రై చేశారు. మొన్నీ మధ్య రాకేష్ మాస్టర్ ఈ షో పై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. దారుణాలు జరుగుతున్నాయని చెప్పి అందరి చేత చివాట్లు కూడా తిన్నారు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్ అవుతుంది..
 

మరింత సమాచారం తెలుసుకోండి: