తెలుగు,
హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న లైజర్ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో లైగర్
సినిమా సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం
హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ఒక సెట్ ను నిర్మించి మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే ఈ
సినిమా ఇంకా పూర్తి కాలేదు కానీ పూరీ జగన్నాథ్ వద్దకు మూడు భారీ
సినిమా అవకాశాలు వచ్చాయి.
పవన్ కల్యాణ్,
బండ్ల గణేష్ కాంబోలో ఒక
సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్నారని
సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుని ఎవరు
డైరెక్టర్ చేయబోతున్నారనే విషయం పై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు.
అయితే
బిజినెస్ మాన్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఆర్.ఆర్
వెంకట్ మళ్లీ
మహేష్ తో కలిసి ఒక
సినిమా చేయాలనుకుంటున్నారు. అయితే
మహేశ్ తో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఓ
మూవీ ప్రొడ్యూస్ చేయాలని ఆయన పట్టుబట్టారట. కానీ
మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కలిసి
సినిమా చేసేందుకు ఒప్పుకుంటారా అనేది ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉండగా
బాలకృష్ణ తన ప్రియ పుత్రుడు అయిన మోక్షజ్ఞని సినిమాల్లో హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నారు. అయితే
పూరి జగన్నాథ్ సినిమాతో
మోక్షజ్ఞ ని
మాస్ హీరోగా పరిచయం చేయాలని
బాలకృష్ణ కోరుకుంటున్నారట. ఇందుకోసం ఇప్పటికే
పూరి జగన్నాథ్ ని
బాలకృష్ణ సంప్రదించినట్లు కూడా సమాచారం అందుతోంది. నిజానికి
పూరి జగన్నాథ్
చిరంజీవి కుమారుడైన
రామ్ చరణ్ ని
చిరుత సినిమాతో వెండితెరకు
మాస్ హీరోగా పరిచయం చేశారు.
చిరుత సినిమా ఇప్పటికీ
రామ్ చరణ్ కెరియర్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. అయితే
బాలకృష్ణ కూడా తన కుమారుడు మొదటి చిత్రం తోనే మంచి హిట్ కొట్టాలని బాగా తపన పడుతున్నారు. అందుకే
బాలయ్య పూరి జగన్నాథ్ తో తన కుమారుడు డెబ్యూ చిత్రాన్ని ప్లాన్ చేయాలని చూస్తున్నారు.
అయితే మరి లైగర్
సినిమా అనంతరం పూరీ జగన్నాథ్
మహేష్ తో కలిసి
సినిమా తీస్తారా,
మోక్షజ్ఞ తో కలిసి
సినిమా తీస్తారా లేక
పవన్ తో కలిసి
సినిమా చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన దేనికి ఓటేస్తారని దానిపై ప్రస్తుతం సినీ వర్గాల్లో మాత్రం ఆసక్తి నెలకొంది.