టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు వున్న బాలయ్య ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఆయన రూటే సెపరేటు.ఆయన క్రేజ్, స్టైల్ అంతా డిఫరెంట్.ఇక బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ'. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' 'లెజెండ్' చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఆ సినిమాలో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. అలాగే నందమూరి అభిమానులకి ఎంతగానో గుర్తుండిపోయే సినిమాలు అవి.దాంతో వీరి కాంబోలో ఈ సినిమా పై అంచనాలు భారీగా వున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ మధ్య విడుదల అయినా 'అఖండ' టీజర్ రెట్టింపు చేసిందనే చెప్పాలి.ఇక టీజర్ ప్రస్తుతం యూట్యూబ్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.


ఉగాది రోజున ఈ చిత్రం టైటిల్ ను 'అఖండ' గా ప్రకటించి ఆ టీజర్ ను విడుదల చేశారు.అలా విడుదల చేశారో లేదో సోషల్ మీడియాలో సెన్సేషనల్ హిట్ అయ్యి తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ఈ టీజర్‌లో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…' అంటూ బాలయ్య చెప్పే డైలాగులు కూడా హైలెట్ గా నిలిచాయి. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో 'ద్వారక క్రియేషన్స్' బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక టీజర్ లో బాలయ్య పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్ ఏంటో పూర్తిగా అర్ధమైపోతుంది. బాలయ్యని చూసి కుర్ర హీరోలు సైతం తెగ భయపడుతున్నారు. నిజంగా బాలయ్య కుర్ర హీరోలకి ఏమాత్రం తగ్గకుండా ఆదరకొడుతున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటి వరకూ 'అఖండ' టీజర్ 28 మిలియన్ల వ్యూస్ ను అలాగే 370K లైక్స్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: