ప్రస్తుతం టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు దాదాపు 25 కు పైగా నే ఉన్నాయి.  థియేటర్ లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి.. అప్పుడు తమ సినిమాలు రిలీజ్ చేద్దామని నిర్మాతలు కాచుకు కూర్చున్నారు.  అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి దండ యాత్ర చేసినట్లు థియేటర్లపై దండయాత్ర చేస్తే మాత్రం థియేటర్ల కరువు,  గొడవలు అవ్వడం తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల అయితేనే గతంలో చాలా సార్లు ఎన్నో గొడవలు అయ్యాయి డిస్ట్రిబ్యూటర్లకు మధ్య. మరి ఇప్పుడు ఇన్నేసి సినిమాల విడుదల అంటే థియేటర్లు పంచలేక యుద్ధాలు జరుగుతాయి కావచ్చు.

తమ సినిమాలను అర్జెంటుగా విడుదల చేయాలనుకునే నిర్మాతలలో కొంతమంది ఓటీటీ వెళితేనే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. అందరికీ వడ్డీ భారం పెరుగుతుండడంతో, లాక్ డౌన్ పడడంతో, థియేటర్లు మూసుకుపోవడంతో ఇన్నాళ్లు తమ సినిమాలను విడుదల చేయడాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు తెలంగాణ తో సహా పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తి వేయడం తో తమ సినిమాను విడుదల చేసేందుకు ఇదే సరైన సమయం అని నిర్మాతలు భావించి తమ సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫిలింఛాంబర్లో ఈ విడుదల కావాల్సిన సినిమాలు లెక్క 30 వరకు చేరిందట. సినిమాలు ఒకేసారి విడుదల అయితే సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అంతేకాకుండా గొడవలు కూడా అవుతాయని కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వెళితే మంచిదని సలహాలు ఇస్తున్నారట. అయితే ఆ వరద కన్నా ఈ బురదే నయం అనుకున్నారేమో ఇప్పటికే నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు ఓటీటీ లో విడుదల అవ్వడానికి రంగాన్ని సెట్ చేసుకుంటున్నారట. వెంకటేష్ దృశ్యం 2, రానా విరాటపర్వం, అలాగే నితిన్ మాస్ట్రో సినిమాలు ఓటీటీ లో డిజిటల్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయట.  వాటి విడుదల తేదీలు కూడా త్వరలోనే వెల్లడి అవుతాయని తెలుస్తుంది.  ఈ బురద నయం అన్నట్లుగా మన స్టార్స్ ఓటీటీ లలో విడుదల చేస్తున్న ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: