డైరెక్టర్ మారుతి సినిమాలు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా కూల్ గా కుటుంబాన్ని మొత్తం చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఈయన నుంచి వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫిస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.ఇప్పుడు టాలివుడ్ పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనున్నాడు.ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాతో బిజిగా ఉన్నాడు.ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.


సినిమా తో పాటు నెక్స్ట్ మూవిస్ పై కూడా ఫోకస్ పెట్టాడు..ఇప్పటికే 'ఆదిపురుష్' చిత్రాన్ని పూర్తి చేసిన ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ K' షూటింగ్ మొదలు పెట్టాడు. అంతేగాక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్' అనే సినిమాను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశాడు.ఎవరి అంచనాలకు అందకుండా ఆ మధ్య మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే సినిమా కూడా చేయనున్నట్లు ప్రచారం మొదలైంది. టైటిల్ తో సహా వచ్చిన సోషల్ మీడియా న్యూస్ అప్పుడే ఫ్యాన్స్ ను ఒకింత కలవర పెట్టినా, మారుతి స్టయిల్ ఆఫ్ కామెడి టైమింగ్ తో సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చర్చించుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్..


మారుతి ఈ సినిమాను ఎలా చేస్తారు..ప్రభాస్ కోసం ఎలాంటి కథను సిద్దం చేస్తాడు అనేది సినీ వర్గాల్లొ అనేక చర్చలకు దారి తీస్తుంది.పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట.ఈ ముగ్గురూ హీరోయిన్లలో ఒకరు అనుష్క అని గత రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది.మిగతా ఇద్దరు హీరోయిన్స్ కోసం మేకర్స్ హంటింగ్ మొదలు పెట్టారట. ప్రభాస్-అనుష్క హిట్ కాంబినేషన్. బాహుబలి తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అందుకు తగ్గట్లే మారుతీ ఈ కాంబినేషన్ సెట్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడట...మరి ఈ సినిమా ఎప్పుడూ సెట్స్ మీదకు వెళుతూందోనని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: