టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన సంపత్ నంది గురించి ప్రత్యేకంగా  పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమైంది ఈ వేళ అనే ఒక తక్కువ బడ్జెట్ మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన సంపత్ నంది మొదటి మూవీ తోనే ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల మనసు దోచుకున్నాడు.

ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రచ్చ మూవీ కి దర్శకత్వం వహించిన సంపత్ నంది రచ్చ మూవీ తో మాస్ దర్శకుడిగా మారిపోయాడు. అప్పటి నుండి సంపత్ నంది మాస్ మూవీ లకు మాత్రమే దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సంపత్ నంది చివరగా సిటీ మార్ మూవీ కి దర్శకత్వం వహించాడు. సిటిమర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న సంపత్ నంది ఇప్పటివరకు తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సంపత్ నంది తదుపరి మూవీ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి  వెళితే ... సంపత్ నంది , గోపీచంద్ హీరోగా తన తదుపరి మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు, ఇప్పటికే సంపత్ నంది ,  గోపీచంద్ కు ఒక కథను వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చిన గోపీచంద్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇది వరకే గోపిచంద్ , సంపత్ నంది కాంబినేషన్ లో గౌతమ్ నంద , మరియు సిటిమర్ మూవీ లు తెరకెక్కాయి. ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: