పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి సినిమా విడుదల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి అప్డేట్ ను ప్రకటించలేదు ఇక రీసెంట్గా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది ఇక తర్వాత పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం 17వ శతాబ్దం కాలం నాటి మగల్ సామ్రాజ్యం నేపథ్యంలో దొరకెక్కిస్తూ ఉన్నారు.


సినిమా షూటింగ్ కూడా చాలా నెమ్మదిగా కొనసాగుతూ ఉన్నది దీంతో పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంపై అభిమానులు చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా సమాచారం. ఇదంతా ఇలా ఉండగా వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ అక్టోబర్-5 నుంచి ఆంధ్రప్రదేశ్ అంతట బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ పడిందని అభిమానుల సైతం చాలా ఫీల్ అవుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా కూడా వార్తలు బాగా వినిపిస్తున్నాయి.


దసరా పండుగ రోజున యాత్రను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ అంతట పర్యటించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే జనసేన వర్గాల నుండి పలు సూచనల మేరకు ఇప్పటి నుంచే బస్సు యాత్ర చేస్తే ప్రజలు మర్చిపోతారని వచ్చే ఏడాది ఈ యాత్రను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో బస్సు యాత్రని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉందా.. ఉంటే సినిమాల షూటింగ్ కు సిద్ధమవుతారా అన్నట్టుగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా 50% షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 23న విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: