హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి అతిథులుగా చిరంజీవి, గరికపాటి నరసింహా రావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారి తీశాయి. మెగా అభిమానులు గరికపాటి తీరుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారట. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గరికపాటి వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో పంచ్ వేశారట.. తాజాగా మెగాస్టార్ చిరు... ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు రాసిన `శూన్యం నుంచి శిఖరాగ్రాలకు` పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారట.. శుక్రవారం హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరిగింది. చిరంజీవిపై రాసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయనేగెస్ట్ గా హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా స్టేజ్ పై ఉన్న చిరంజీవితో ఫోటోలు దిగేందుకు మహిళలు క్యూ కట్టారు. ఈ సందర్భంగా... చిరు ఇక్కడ వారే లేరు కదా... హమ్మయ్య అంటూ..పంచ్ వేశారు. దీంతో చిరంజీవి గరికపాటిపై పంచ్ వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అంతకుముందు కూడా మీడియా ఇంటరాక్షన్ లో గరికపాటి వివాదంపై చిరంజీవిని మీడియా ప్రముఖులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. గరికపాటి నరసింహారావు పెద్దాయన, ఆయన వ్యాఖ్యలపై చర్చ అనవసరం అన్నారట మెగాస్టార్. ఆయన పెద్ద పండితుడు, మంచీ చెడులకు తారతమ్యం తెలిసినవారు అన్నారు. కాబట్టి ఈ వివాదం గురించి మాట్లాడవలసిన అవసరం లేదని మరోసారి చిరంజీవి తన హుందాతనం చాటుకున్నారట.. పరోక్షంగా వివాదం మరింత పెద్దది చేసే ఆలోచన లేదని చెప్పకనే చెప్పారు మెగాస్టార్. కానీ తాజాగా చిరు గరికపాటిపై వేసిన సెటైర్లు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి