తాజాగా కార్తికేయ 2 సినిమాతో భారీవిజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ , అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మరొకసారి 18 పేజీస్ సినిమాలో జత కట్టిన విషయం తెలిసిందే.  డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి పాటలు ఎప్పుడు విడుదలవుతాయని అభిమానులు ఎదురు చూశారు.  ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సింగల్ ట్రాక్ రేపు విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్,  టీజర్ అన్నీ కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్ ట్రాక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం 18 పేజీస్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది . పల్నాటి సూర్య ప్రతాప దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసాయి.  ఈ సినిమాలో నిఖిల్ భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు.  కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా విడుదల వాయిదా పడవలసిన అవసరం వచ్చింది.  ఈ నేపథ్యంలోని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జిఏ 2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.  గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తుండడం గమనార్హం. ఇప్పటికే కార్తికేయ 2 చిత్రం రిలీజ్ అయ్యి ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా కారణంగా కూడా 18 పేజీస్ సినిమాపై అంచనాలు పెరిగాయి.  మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ జంటకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం  కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: