రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన బాహుబలి మూవీ తో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో తన గుర్తింపు ను పెంచుకున్నాడు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మూవీ లలో అంతకుమించిన మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ ఇప్పటికే సాహో , రాదే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటించాడు. ఈ మూవీ ల ద్వారా ప్రభాస్ తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ప్రభాస్ వరుస మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఆది పురుష్ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ప్రభాస్ మూడు మూవీలలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: