నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఫిబ్రవరి 10వ తేదీన సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన అమిగోస్  అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే  ఇక ఈ సినిమాలో మొదటిసారి కళ్యాణ్ రామ్ కెరియర్ లో త్రిపాత్రాభినయం చేశాడు. మూడు విభిన్నమైన పాత్రల్లో కళ్యాణ్ రామ్ నటన ఇరగదీశాడు అన్నది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమయింది. అయితే బింబిసారా లాంటి సినిమాలో ద్విపాత్రాభినయం చేసి హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్ ఇక ఇప్పుడు తన త్రిపత్రాభినయంతో సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.


 రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే అమిగోస్ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన కథను కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లడానికి ముందే డైరెక్టర్ రాజేంద్రరెడ్డి మరో హీరోకి వినిపించాడట.  ముందుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అమిగోస్ కథను వినిపించాడట. అయితే కొత్త డైరెక్టర్ కావడం పైగా సినిమాలో మూడు క్యారెక్టర్లు ఉండడంతో ఇక ఎలా ప్రేక్షకులను సాటిస్ఫై చేయాలో తెలియక.. మరోవైపు కొత్త దర్శకుడు ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే అనుమానంతో ఇక విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడట.


 ఇక అవిగోస్ అనే సినిమాను రిజెక్ట్ చేసి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ అనే సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడట. ఇక తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కళ్యాణ్ రామ్ దగ్గరికి ఈ కథ వెళ్లగా.. సింగిల్ సెట్టింగ్ లోనే కథ నచ్చడంతో ఓకే చెప్పేసాడట. అయితే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాను టేకప్ చేశారంటే ఆ సినిమా దాదాపు హిట్ అయినట్లే అనే భావన ప్రేక్షకుల్లో ఉంది. ఇక ఇప్పుడు అమిగోస్ కోసం సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: