ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఇక ఈ రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా అంగరంగ వైభవంగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి పనులు కూడా జరగడం జరిగింది. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం పలు రకాల ప్రమోషన్స్ ను కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.


ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలలో మొదటిసారిగా ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పటికీ గుర్తుండి పోయే స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ సినిమాని పూర్తిగా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగా ప్రమోషన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ 50 అడుగుల కటౌట్  చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇక ప్రి రిలీజ్ నిర్వహించే సేట్టుని కూడా అయోధ్య లాగా కనపడేలా భారీ సేట్టుని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆది పురుష్ రామాయణం పాటలకు ఈవెంట్లు వందమంది డాన్సర్లు వందమంది గాయకులు కూడా ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు సమాచారం.


ఇందులో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అలాగే హనుమాన్ సినిమాలో నటించిన తేజ సజ్జా కూడా యాంకరింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరొక యాంకర్ ఝాన్సీ కూడా పోస్టుగా చేయబోతున్నట్లు సమాచారం. దాదాపుగా లక్ష మందికి పైగా అభిమానులు ప్రేక్షకులు రాబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకున్నట్లు తెలుస్తోంది చిత్ర యూనిట్ ఈ రోజున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
.

మరింత సమాచారం తెలుసుకోండి: