రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... "కే జి ఎఫ్" సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. రవి బుశ్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ మొత్తం గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగాన్ని కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర బృందం సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన సమయం లో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయడం లేదు అని ప్రకటించారు. కాకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దానితో రోజుకో వార్త ఈ మూవీ విడుదలపై పుట్టుకస్తుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని ఈ చిత్ర బృందం వచ్చే సంవత్సరం మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: