శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా వచ్చిన తాజా సినిమా పెదకాపు 1.  అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచింది. సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అనసూయ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. ముందుగా పెదకాపులో మీ పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.." సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాను. 

సినిమా చూసిన తర్వాత నా పాత్ర ఇంకా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో నా పేరు కూడా కొత్తగా అనిపించింది. సినిమా రిలీజ్ తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారని నమ్మకముంది. సినిమాలో నా పాత్ర చాలా బలంగా వైవిధ్యంగా ఉంటుంది. పెదాకాపు చాలా రా ఫిలిం. నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి" అని తెలిపింది. 'DOP చోటా కె నాయుడు గారు ఈ సినిమాలో మిమ్మల్ని రిఫర్ చేశారని న్యూస్ వచ్చింది. నిజమేనా?' అని అడిగితే.." అవును, సందీప్ కిషన్ 'మైఖేల్' సినిమాలో చేశాను. ఆ సినిమా చూసి చోట గారు ఫోన్ చేశారు. 'నీకు ఒక ఫోన్ వస్తుంది. ఆ పాత్ర చేయమని చెప్పను కానీ కన్సిడర్ చెయ్' అని చెప్పారు. శ్రీకాంత్ గారు ఈ కథ చెప్పిన తర్వాత తప్పకుండా ఇలాంటి మంచి సినిమాలో

 భాగం కావాలని అనుకున్నాను" అని అన్నారు. ఆ తర్వాత సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ నటించడం పై మాట్లాడుతూ.." నిజంగా ఇది బిగ్ సర్ప్రైజ్. కథ విన్నప్పుడు శ్రీకాంత్ గారు నటిస్తున్నారని నాకు తెలియదు. సాధారణంగా ప్రతి డైరెక్టర్ లో ఒక నటుడు ఉంటాడు. ఇలా చేయాలని మొదట చేసి చూపించేది వాళ్లే కదా. సినిమాలో శ్రీకాంత్ గారు చాలా ఈజ్ తో ఆ పాత్ర చేశారు. ప్రేక్షకులు చాలా సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో పాత్ర ని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి పాత్రకు ఒక మేకోవర్ ఉంది. ఈ సినిమా చాలా మంచి అనుభవం అని" తెలిపింది అనసూయ భరద్వాజ్.


మరింత సమాచారం తెలుసుకోండి: