‘అఖండ’ ‘వీరసింహా రెడ్డి’ సినిమాల సూపర్ హిట్ తరువాత హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ‘భగవంత్ కేసరి’ తో చేసిన ప్రయత్నం పూర్తిగా విజయవంతం కాకపోయినా బాలయ్య ఏమాత్రం నిరాశలో లేడు. వచ్చేనెల బాబీ దర్శకత్వంలో ప్రారంభించబోతున్న మరో మూవీని లైన్ క్లియర్ చేసిన బాలయ్య వచ్చే సంవత్సరం తన కలల ను నిజం చేయబోతున్న సంవత్సరంగా భావిస్తున్నాడు.


ఈమధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే సంవత్సరం తన కెరియర్ లో అత్యంత కీలకం అనీ ఆ సంవత్సరం తాను తన కెరియర్ కు సామబంధించిన మూడు కోరికలను ఒకే సినిమాతో తీర్చుకోబోతున్న విషయాన్ని వివరించాడు. తన సినిమాలలో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగా ప్రశంసలు అందుకున్న ‘ఆదిత్యా 369’ మూవీకి సీక్వెల్ తీయాలని తాను ఎప్పటి నుంచో కలలు కంటున్న విషయాన్ని వివరిస్తూ ఆసినిమాకు ‘ఆదిత్యా 999’ అన్న టైటిల్ ఇప్పటికే తాను కథను సిద్ధం చేసిన విషయాన్ని వివరించాడు.


ఈసినిమాకు సంబంధించిన ఆలోచన తనకు ఒక రాత్రి నిద్రలో వచ్చిందని వెనటనే తాను నిద్రలేచి ఆ కథ పాయింట్ ను పేపర్ పై పెట్టి ఆతరువాత ఆ కథను డెవలప్ చేసిన విషయాన్ని వివరించాడు. అంతేకాదు తనకు ఎప్పటి నుంచో దర్శకుడుగా మారాలి అన్న కోరిక ఉండటంతో తాను ఈమూవీతో దర్శకుడుగా మారబోతున్న విషయాన్ని వివరించాడు. ఇక ఈమూవీలో మోక్షజ్ఞ ఫిలిమ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఇక నుంచి తన కొడుకు జూనియర్ బాలయ్యగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అని అంటున్నాడు.


దీనితో ఒక్క సినిమాతో బాలయ్య తన జీవితంలో కల కంటున్న మూడు కోరికలను తీర్చే సంవత్సరంగా 2024 మారబోతోంది అనుకోవాలి. అన్నీ అనుకూలిస్తే 2025 సమ్మర్ కు ఈమూవీని విడుదల చేయాలని బాలయ్య ఆలోచన అని అంటున్నారు. ఎప్పటి నుండో బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురు చూస్తున్న నేపధ్యంలో ఈమూవీకి రికార్డులు క్రియేట్ చేసే ఓపెనింగ్ కలక్షన్స్ రావడం ఖాయం..







మరింత సమాచారం తెలుసుకోండి: