అయితే ఆ కుటుంబ సభ్యుల కన్నీటి కష్టాల గురించి తెలుసుకున్న విజయ్ ఆ కుటుంబాలకు న్యాయం జరగాలని ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురు ఖైదీలను జైలు నుంచి విడిపించి మంచి మనస్సును చాటుకున్నారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలను విజయ్ విడుదల చేయించడంతో ఖైదీల కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తున్నారు.కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు తమతో లేకుండా జీవించడం చాలా కష్టమని అలాంటి బాధ ఎవరికీ రాకూడదని దునియా విజయ్ చెప్పుకొచ్చారు. గతంలో జరిమానా చెల్లించి పలువురు వృద్ధ ఖైదీలను దునియా విజయ్ జైలు నుంచి విడుదల చేయించిన సందర్భాలు సైతం ఉన్నాయి. తన స్వగ్రామంలోని ఆరుగురు ఖైదీలు జరిమానా చెల్లించలేక జైలు జీవితం గడుపుతుండటంతో దునియా విజయ్ ఆ మొత్తాన్ని చెల్లించి వాళ్లను కస్టడీ నుంచి విడిపించారు. ప్రస్తుతం గోపీచంద్ భీమ్ మూవీలో దునియా విజయ్ నటిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి