తమిళ స్టార్ కార్తీ  తెలుగు ప్రేక్షకులపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఆడియెన్స్ తనకు సంబంధించిన వరకు ఇలాంటి వారు అంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.కోలీవుడ్ హీరో కార్తీ సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఎంతలా ఇష్టపడుతారో తెలిసిందే. తమిళ హీరో అయినప్పటికీ కార్తీ తెలుగు లో చాలా స్పష్టం గా, సరళం గా మాట్లాడగలరు. దాం తో ఇక్కడి వారి తో సులువు గా కలిసిపోయారు.అన్న సూర్య  ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చినప్పటి కీ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కార్తీ.. విభిన్న కథలు ఎంచుకుంటూ తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చివరిగా 'జపాన్'తో అలరించారు.అయితే.. కార్తీ తెలుగు స్పీచ్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంటుంది. ఆయన మాట్లాడే తీరు అందరికీ నచ్చుతుంది. ముఖ్యం గా తెలుగు ఆడియెన్స్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఇప్పటికే పలు మార్లు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి వారో చెప్పుకొచ్చారు. తాజాగా మరోమారు మన ఆడియెన్స్ పై తమిళ స్టార్ కార్తీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'మీకు తమిళ ఆడియెన్స్ ఇష్టమా? తెలుగు ఆడియెన్స్ ఇష్టమా?' అని అడిగిన ప్రశ్న కు ఇలా బదులిచ్చారు.'నాకు కచ్చితంగా తెలుగు ప్రేక్షకులంటేనే ఇష్టం. ఎందుకంటే వారికి భాషాబేధాలు ఉండవు. నా ప్రతి సినిమా ను వారు ప్రోత్సహించారు. ప్రతి సన్నివేశాన్ని వాళ్లు ఎంత గానో సెలబ్రేట్ చేసు కున్నారు. నాకు వారు దొరకడం చాలా సంతోషం గా ఉంది.' అంటూ తెలుగు ఆడియెన్స్ పై తన ప్రేమను కురిపించాడు.ఇక కార్తీ ఒక్కరే కాదు... రజనీకాంత్, విక్రమ్, విజయ్ దళపతి, సూర్య, సిద్ధార్థ్, విశాల్, రాఘవా లారెన్స్, విజయ్ సేతు పతి తెలుగు ప్రేక్షకులు తమను ఆదరించే తీరును ఆకాశానికి ఎత్తారు. గతంలోనూ కార్తీ 'తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించినంత గా తమిళ ప్రేక్షకులు ఆదరిం చలేదన్నారు'.

మరింత సమాచారం తెలుసుకోండి: